అంబాలలో ఉపసర్పంచ్ సహా వందమంది చేరిక
కమలాపూర్, ఆగస్టు 27: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రా మంలోని ముదిరాజ్ కులస్థులు టీఆర్ఎస్కు జైకొట్టారు. ముదిరాజ్ కులానికి చెందిన ఉపసర్పంచ్ తిరుపతితోపాటు వందమంది టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో అభ్యర్థి గెల్లును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో హనుమకొండలోని టీఆర్ఎస్లో చేరారు.