ఖైరతాబాద్, జనవరి 6: ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తా మని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహావేదిక అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు. హైదరాబాద్ సో మాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం మీడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా ముదిరాజ్ జనాభా ఉన్నదని, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకముందే కాంగ్రెస్ తన హా మీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం 2018లో కోకాపేటలోని ఐదెకరా ల స్థలంలో, రూ.5 కోట్లతో చేపట్టిన భవ న నిర్మాణం పూర్తికావచ్చిందని, సీఎం రేవంత్రెడ్డి దానిని పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని కోరారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ముదిరాజ్ నేతలకు అన్నిపార్టీలు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వేదిక రాష్ట్ర కోకన్వీనర్ అల్లుడు జగన్ ముదిరాజ్, సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరవేణి రంజిత్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.