మే 6 నుంచి సన్నాహక సమావేశాలు
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి
ఉప్పల్, ఏప్రిల్ 26: జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలపై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ పార్టీలు దశాబ్ధాలుగా జాతిని వంచిస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడలో ఎమ్మార్పీఎస్ రాష్ట్రస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయపార్టీలు మాదిగ ఉప కులాలను దగా చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయని ధ్వజమెత్తారు.
పలు వేదికలపై కాంగ్రెస్, బీజేపీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని మాయమాటలు చెప్తూ అధికారంలోకి వచ్చాయని, నేడు దాటవేసే ధోరణిలో పార్టీలు ఉన్నాయని దుయ్యబట్టారు. జాతికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామరని ప్రకటించారు. ఇందులో భాగం గా మే 6 నుంచి 29 వరకు పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.