ఉప్పల్, అక్టోబర్ 27: మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెపుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను మోసం చేసిన బీజేపీపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. శుక్రవారం హైదరాబాద్ హబ్సిగూడలోని ఓ హోటల్లో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. మాదిగలంతా ఏకతాటిపైకి రావాలని, బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, కోర్కమిటీ సభ్యులు కొండ్ర శంకర్, గుర్రాల శ్రీనివాస్, డాక్టర్ మల్లేశ్, పొట్టపెంజర రమేశ్, చింత బాబు, బాబురావు, నరసింహా, శ్రీనివాస్, మోహన్, రుక్కమ్మ, లక్ష్మి, వెంకట్, ప్రభాకర్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.