జూబ్లీహిల్స్, డిసెంబర్ 19: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ చెప్పారు. ఈ నెల 21న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాదిగలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో 28 ఏండ్లుగా టీఎమ్మార్పీఎస్ చేస్తున్న తుది పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్ అంశంపై పలుమార్లు వంచించిన బీజేపీ తీరుకు నిరసించాలని పిలుపునిచ్చారు.