హైదరాబాద్, జూలై 19 (నమస్తేతెలంగాణ) : ఎల్నినో సందర్భంగా కరువు పరిస్థితుల పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాలవారిగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ఆదివారం నియమించింది. వీరు ప్రత్యేక అధికారులుగా జిల్లాలకువెళ్లి ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం సీఎస్కు నివేదిక అందజేస్తారు. హైదరాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా జయేశ్రంజన్, రంగారెడ్డికి వికాస్రాజ్, కరీంనగర్కు బీఎండీ ఎక్కా, మెదక్కు వాణీప్రసాద్, నిజామాబాద్ జిల్లాకు యోగితారాణా, నల్లగొండకు దాసరి హరిచందన, ఆదిలాబాద్కు ఇలంబరితి, వరంగల్కు దేవసేన, మహబూబ్నగర్కు వీపీ గౌతమ్, ఖమ్మం జిల్లాకు దురిశెట్టి అనుదీప్ ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.