పొతంగల్, జూలై 19 : వీధి కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన ఘటన మండలంలోని సుంకిని గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికులు, ఫారెస్ట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సుంకిని మం జీరా శివారులో వీధి కుక్కలు ఓ జింకపై దాడి చేయగా, అక్కడున్న రైతులు కుక్కలను తరిమికొట్టారు. అనంతరం అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకోగా, అప్పటికే జింక మృతి చెందింది. పంచనామా చేసి దహనం చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారి సురేశ్ తెలిపారు.