ఖైరతాబాద్, ఏప్రిల్ 12: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓటేయొద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవా రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న మా దిగలకు ఒక్క లోక్సభ సీటు కేటాయించకుం డా ఆ పార్టీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.
ఈ నెల 16 వరకు వేచి చూస్తామని, ఆతర్వాత ‘గోబ్యాక్ కాంగ్రెస్’ నినా దం ఎత్తుకుంటామని స్పష్టం చేశారు. ఆ పార్టీపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తామని, తమతో బీసీ, మైనార్టీలు కూడా కలిసి రావాలని కోరారు. వర్గీకరణకు మద్దతు ఇవ్వని కాంగ్రెస్.. మాదిగలకు ఏదో చేస్తుందన్న నమ్మకం లేదని, పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించేందుకు ఒక్క ఎంపీకి అవకాశం ఇవ్వనప్పుడు ఆ పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు.