యాదాద్రి, ఏప్రిల్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజ లు కొనసాగాయి. తెల్లవారు జామున సుప్రభాతంలో స్వా మి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక స్వాములు బాలాల యంలో కవచమూర్తులకు హారతి నివేదించారు. బాలాల యంలోని ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వ హించి, మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం ఆగమశాస్త్రరీతిలో జరిపారు. సాయంత్రం అలం కార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వ హించారు. స్వామివారి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామివారికి మహాన్యాస పూ ర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. యాదాద్రీశుడి ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పాల్గొని రుద్రాభిషే కం జరిపించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషే కంలో మమేకం అయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచా మృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయం లోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వా మి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవా లు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారిని ప్రత్యేకం గా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. లక్ష్మీనరసిం హుని బాలాలయంలో సుదర్శన నారసింహ మహాయా గం, నిత్య తిరుకల్యాణోత్సవం భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఖజానాకు రూ. 3,39,357 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ. 3,39,357 ఆదాయం సమ కూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 13,546, రూ. 100 దర్శనాలతో రూ. 1, 900, వీఐపీ దర్శనాలతో రూ. 6,150, సుప్రభాతంతో రూ. 200, ప్రచారశాఖద్వారా రూ. 2,500, క్యారీ బ్యాగు లతో రూ. 1,625, వత్రాలతో రూ. 16,500, కల్యాణ కట్టతో రూ. 15,800, ప్రసాద విక్రయాలతో రూ. 1,87, 900, వాహనపూజలతో రూ. 65,00, టోల్గేట్ ద్వారా రూ. 589, అన్నదాన విరాళంతో రూ. 200, సువర్ణ పుష్పా ర్చనతో రూ. 29,296, యాదరుషి నిలయంతో రూ. 30, 600, శివాలయం ద్వారా రూ. 200, పాతగుట్టతో రూ. 4,260, టెంకాయల విక్రయాలతో రూ. 21,600తో కలిపి రూ. 3,39,357 ఆదాయం లభించిందన్నారు.
ఇవీ కూడా చదవండి…
లోకుహెట్టిగెపై ఎనిమిదేండ్ల నిషేధం
ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి