దుబాయ్: మాజీ క్రికెటర్లపై నిషేధాల పర్వం కొనసాగుతున్నది. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ను ఉల్లంఘించినందుకు ఇప్పటికే జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్పై ఎనిమిదేండ్ల నిషేధం వేటు పడగా, తాజాగా లంక క్రికెటర్ దిల్హరా లోకుహెట్టిగె ఈ జాబితాలో చేరాడు. 2017లో యూఏఈలో జరిగిన టీ20 టోర్నీలో లోకుహెట్టిగె మ్యాచ్ ఫిక్సింగ్లో పాలుపంచుకున్నట్లు 2019లో కేసు నమోదైంది. ‘శ్రీలంక తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన దిల్హరా అవినీతి నిరోధించే విషయంలో చాలా సెషన్లకు హాజరయ్యాడు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష పడుతుందన్నది తెలిసినా..అతను ఫిక్సింగ్లో భాగమయ్యాడు’ అని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు. 2016లో క్రికెట్కు వీడ్కోలు పలికిన లోకుహెట్టిగె లంక తరఫున తొమ్మిది వన్డేలు, రెండు టీ20 మ్యాచ్లు ఆడాడు.