హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్సీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన నిర్ణ యం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ‘శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చే యడం లేదు. ఈ నిర్ణ యం పూర్తిగా తన వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావి తం చెయ్యలేదు. నాలు గు దశాబ్దాలుగా, మూడుతరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు, నన్ను ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు కృతజ్ఞుడిని. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేశా. టీడీపీతో రాజకీయంగా విభేదించా. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్ర జలు, మిత్రులు, సహచరులు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు’ అని ఎక్స్లో పేర్కొన్నారు.