హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ 45వ జన్మదినం సందర్భంగా ఇసుక మట్టి, చెట్ల ఆకులతో కలిసిన అరుదైన పెయింటింగ్ గీశారు. కాకతీయ ఇన్నోవేటివ్స్ సంస్థ అధినేతలు బందూక్ లక్ష్మణ్, రమేశ్ మాదాసు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసాతో కలిసి ఈ అద్భుతమైన ప్రయోగం చేపట్టారు.
మట్టిని నమ్ముకొని, మొక్కలు నాటించి, యావత్ తెలంగాణ హరితవిప్లవానికి నాంది పలికిన ఎంపీ సంతోష్ కుమార్ చిత్రపటాన్ని ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం ఇసుకమట్టి, చెట్ల ఆకులతో చిత్రీకరించారు. ఎంపీ జన్మదినం సందర్భంగా వినూత్న పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నది.