హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ శనివారం మొక్కను నాటి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హైదరాబాద్ టోలిచౌకిలోని తన నివాసంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కను నాటి స్వాగతం పలకడం ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.