Santosh Kumar | హైదరాబాద్ : నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్ నర్రె రాజేశ్ మృతిపట్ల బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సంతాపం ప్రకటించారు. రాజేశ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతోష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేశ్ మృతి చెందాడన్న వార్త తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. ఫొటోగ్రఫి అంటే రాజేశ్కు ఎంతో మక్కువ అని సంతోష్ తెలిపారు.
సైదాబాద్లో నివాసం ఉంటున్న రాజేశ్కు శనివారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మలక్పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు. రాజేశ్ 2011 నుంచి నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు శివాని, వర్షిత ఉన్నారు.
Deeply saddened to hear about the passing of Rajesh, a passionate photographer at #NamastheTelangana. Heartfelt condolences to his family & colleagues. His memory will remain through the stories he told. @ntdailyonline pic.twitter.com/5cKwWB7fDZ
— Santosh Kumar J (@SantoshKumarBRS) February 10, 2024