హైదరాబాద్ : ఖమ్మం జిల్లా(Khammam) కాంగ్రెస్లో(Congress) వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రసాభాసా చోటు చేసుకుంది. మూడు గ్రూపులుగా విడిపోయి నాయకుల ముందే రచ్చరచ్చ చేశారు. సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి(MP Renuka Chaudhary )మాట్లాడుతుండగా భట్టీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పార్టీ శ్రేణులపై ఫైర్ అయ్యారు. మండల ప్రెసిడెంట్లు అని ఎవరెవరో కూర్చున్నారు.
అందరూ నాకు కనపడటం లేదు.. అన్ని ఏరియాస్ నుంచి మండల ప్రెసిడెంట్స్ రాలేదని ఆమె పేర్కొ న్నారు. ఇంత నిర్లక్ష్యం చేయడం సరికాదు. పదవుల కోసం పాకులాడటం, చిల్లర వేషాలు, నాటకాలు, మోసాలు మానేయండని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టుకుంటారు. మీకు పదవులు కావాలంటే ఏ బూతులో ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తాం అన్న రేణుక చౌదరి వ్యాఖ్యలకు కార్యకర్తలు(Congress activists) ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ చేశారు.
మీరు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు వొచ్చి మాకు నీతులు చెప్తే ఎలా అని కార్యకర్త అనగానే నువ్వు ఎవడ్రా చెప్పడానికి అంటూ కార్యకర్తపై రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎంత నచ్చ చెప్పినా వినకుండా కార్యకర్తలు నానా హంగామా సృష్టించారు.
నువ్వూ ఎవడ్రా చెప్పడానికి.. ఖమ్మం కార్యకర్తల సమావేశంలో కార్యకర్త పై రేణుక చౌదరి ఫైర్.
మండల ప్రెసిడెంట్లు అని ఎవరెవరో కూర్చున్నారు, అందరూ నాకు కనపడటం లేదు.. అన్ని ఏరియాస్ నుంచి మండల ప్రెసిడెంట్స్ రాలేదు..
ఇంత నిర్లక్ష్యం చేయడం వీలు కాదు, పదవుల కోసం పాకులాడటం, చిల్లర వేషాలు,… pic.twitter.com/GR6eMpDaQO— Telugu Scribe (@TeluguScribe) April 30, 2024