ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి ప్రకటన
30 పడకలకు అప్గ్రేడ్ చేయాలని వినతి
శంషాబాద్ రూరల్, జూన్ 10 : శంషాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను మరింత అభివృద్ధి చేయడానికి తన సొంత నిధులు రూ.కోటి కేటాయిస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి ప్రకటించారు.
శంషాబాద్ దవాఖానను 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన వైద్య విధాన పరిషత్కు లేఖ రాశారు. ఇందుకు రూ.1.55 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో తాను కోటి రూపాయలు భరిస్తానని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు.