హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): వ్యాపారాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తమ్ముడికి ఓ న్యాయం, సెబీ చైర్పర్సన్కు ఒక న్యాయమా? అని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడైతే వ్యాపారాలు చేసుకోవద్దా? అని సీఎం అన్నారని, మరి సెబీ చైర్ పర్సన్ కంపెనీల షేర్లు ఎందుకు కొనొద్దని ప్రశ్నించారు.
రాహుల్గాంధీకి హిండెన్ బర్గ్ వార్తలపై తప్ప సెబీపై, సుప్రీంకోర్టుపై, ప్రజాస్వామ్యంపై నమ్మ కం లేదని మండిపడ్డారు. బ్లిట్జ్ పేపర్లో రాహుల్ గాంధీకి పెండ్లయిందని, పిల్లలున్నారని రాశారని చెప్పారు. హిండెన్ బర్గ్ రాసింది నిజమే అయితే బ్లిట్జ్ రాసింది కూడా నిజమేనా? అని ప్రశ్నించారు. ఒకవేళ తప్పయితే నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.
బ్లిట్జ్ పేపర్పై సీఎం రేవంత్రెడ్డి సిట్ వేస్తారా? అని సవాల్ విసిరారు. హిండెన్ బర్గ్ నివేదికకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రాజకీయంగా రచ్చ చేయడం చూస్తుంటే ఆ నివేదిక రూపకల్పనకు కాంగ్రెస్ సహకరించిందనే అనుమానం కలుగుతున్నదని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు.