హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): బీసీల పట్ల వ్యతిరేక ధోరణిని వీడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణ య్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. దేశంలోని బీసీలకు 76 ఏండ్లుగా అన్యా యం జరుగుతున్నదని, ఇది ఇంకెన్నాళ్లు కొనసాగుతుందని ప్రశ్నించారు. బీసీ సంఘాల డిమాండ్ల ను వివరిస్తూ మంగళవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు.
బీసీల అ భ్యున్నతి కోసం చేపట్టే చర్యలను బీజేపీ మ్యానిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, బీసీ స్టడీ సరిళ్లు ఏర్పాటు చేయాలని, ఉపాధి కల్పన నిమిత్తం ప్రతి బీసీ కుటుంబానికి రూ.20 లక్షల సబ్సిడీ ఇవ్వాలని కోరారు. బీసీ వర్గానికి చెందిన మోదీయే ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే భవిష్యత్తులో బీసీలకు ఏ పార్టీ చేయదని అన్నారు.