టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు లోక్సభలో వాయిదా తీర్మానానికి సంబంధించిన నోటీసును ఇచ్చారు. దేశంలో ప్రబలిపోతున్న నిరుద్యోగం, నిరుద్యోగ యువత చేసుకుంటున్న ఆత్మహత్యలపై చర్చను కోరుతూ ఆయన వాయిదా తీర్మాన నోటీసులిచ్చారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానం అమలు తీరుపై చర్చ జరపాలని ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు.