ఖమ్మం: పోడు భూముల గురించి ఆలోచించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageshwar rao)అన్నారు. పోడు భూముల (Podu Lands) పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. మాయమాటలు చెప్పే వాళ్లను ప్రజలు నమ్మొద్దని చెప్పారు. మనందరం సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని వెల్లడించారు.
పాల్వంచలో మంత్రి హరీశ్ రావు గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన రైతులకు పోడు పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.