కల్లూరు, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సత్తుపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడిన సంగతి తెలిసిందే. గురువారం కల్లూరు మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సంభానిని మర్వాద పూర్వకంగా కలిశారు.
బీఆర్ఎస్లో చేరాలని సాదరంగా ఆహ్వానించారు. దీనిపై సంభాని సానుకూలంగా స్పందించి త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. వారి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఎంపీటీసీ కొండూరి కిరణ్కుమార్ ఉన్నారు.