మహబూబాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతిపక్షణం ప్రజల కోసమే పని చేస్తుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబాబూబాద్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 129 మంది లబ్ధిదారులకు రూ.55,55,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందన్నారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరమన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో అధిక సంఖ్యలో సీఎం సహాయ నిధి చెక్కులు ఇప్పించగలుగుతున్నామన్నారు. కష్టకాలంలో అనారోగ్యం బారినపడ్డ వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేసిన సీఎంకు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు బీరవేల్లి భరత్ కుమార్, పర్కాల శ్రీనివాస్రెడ్డి, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ ఖాసీం, ముత్యం వెంకన్న గౌడ్, మంగళంపల్లి కన్నా, జీరిపోతుల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.