హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్ తెలంగాణపై పూర్తిగా కక్ష గట్టినట్టుగా ఉన్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల శత్రువైఖరి అవలంబిస్తున్నదని తాజా బడ్జెట్లో మరోసారి స్పష్టమైందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ దేశానికి అమృతకాలం అని చెప్పటం దుర్మార్గమని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, గడ్డం రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పూర్తి నిరుత్సాహపూరితంగా ఉన్నదని కేకే అభివర్ణించా రు. గ్రామీణ ఉపాధి రంగానికి ఊతమిచ్చే జాతీ య గ్రామీణ ఉపాధిహామీకి 25 శాతం నిధులు కోత పెట్టారని, పట్టణ నిరుద్యోగ సమస్యను పరిషరించడంపై బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. డిజిటల్ అసెట్స్పై 30 శాతం పన్ను వేస్తామంటున్నారని, దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేశారా? అని ప్రశ్నించారు. బడ్జెట్ కార్పొరేట్లకే అనుకూలంగా ఉన్నదని విమర్శించారు.
అన్నివర్గాలకూ వ్యతిరేక బడ్జెట్: నామా
కేంద్ర బడ్జెట్ బడుగు, బలహీన వర్గాలకు వ్య తిరేకంగా ఉన్నదని నామా నాగేశ్వర్రావు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ అమృతకాలం వస్తుందని చెప్పటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఇది ప్రజా, కార్మిక, పేదల, రైతు ల, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అని ఆగ్రహం వ్య క్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పుట్టె డు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే అమృతకాలం అని ఎలా అంటారని ప్రశ్నించారు. కరోనా కాల ంలో అందరినీ బతికించిన రైతు గురించి బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.
ఎవరికీ న్యాయం చేయని బడ్జెట్
కేంద్రం తన ప్రాధాన్యాలను ఎంచుకోవటంలోనే విఫలమైందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్రానికి అనేక ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం వివక్షను ఊరూ రా ఎండగడతామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. కేంద్రం తనకు అనుకూలమైన రాష్ర్టాలకు ఒకరకంగా, ఇతర రాష్ర్టాల పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నదని ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ఆరోపించారు. బీజేపీకి గుణపాఠం తప్పదని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. రాష్ర్టానికి ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రం నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు.