హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : పలువురు మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవగాహనలేమితో ప్రతిపక్షాలపై విమర్శలు చేసి నవ్వులపాలవుతున్నారు. మీడియా ఎదుట కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ .. తమ తెలివి తక్కువ తనాన్ని తేటతెల్లం చేసుకొంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తాజాగా గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సీపీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుతూ .. కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘మేడారం’ గుండెకాయ అని, దానిని కట్టాల్సిన ప్రాంతంలో కట్టకుండా మరోచోట కట్టారని వ్యాఖ్యానించారు. దీంతో ఎంపీ మాట్లాడిన మాటలతో ఆయనకు కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి గురించి కానీ, మేడిగడ్డకు, మేడారానికి కానీ తేడా తెలియదని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ఎద్దేవా చేస్తున్నారు. ‘