కరీంనగర్, డిసెంబర్ 18 (నమస్తేతెలంగాణ): సిరిసిల్ల జిల్లా పరిధిలోని శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో ముం పునకు గురైన బాధితులను తక్షణమే ఆదుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఎస్సారార్ (మిడ్ మానేరు) రిజర్వాయర్ ముంపు గ్రామాల సమస్యలను, ప్రభుత్వం ఇ చ్చిన హామీలను ఈ లేఖ ద్వారా సీఎం దృష్టికి తెస్తున్నానని పేర్కొన్నారు. ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూ ములు త్యాగం చేశారని తెలిపారు.