మిర్యాలగూడ, ఆగస్టు 26: వ్యవసాయం లో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 300 మంది కుల వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి గుత్తా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను సంపన్నులను చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రుణ మాఫీ చేశారని తెలిపారు. మిర్యాలగూడ ని యోజకవర్గంలో రూ.600 కోట్లతో ఐదు లిఫ్టులను ఎమ్మెల్యే భాస్కర్రావు మంజూరు చే యించారని, దామరచర్ల మండలంలో రూ.30 వేల కోట్లతో చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ నిర్మాణం పూర్తి కావచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో, కొనుగోళ్లలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రతిపక్ష నాయకులు మాయమాటలతో మోసం చేసేందుకు గ్రామాల్లోకి వస్తున్నాయని, వారి నమ్మి మోసపోవద్దని సూచించారు.