చంద్రయాణగుట్ట/చార్మినార్, సెప్టెంబర్ 2: ఓల్డ్సిటీ అభివృద్ధి కోసం గత తొమ్మిదేండ్లుగా అహర్నిషలు కృషిచేస్తూ అనుకున్న లక్ష్యాల సాధనలో ముందుకెళ్తున్నామని హోంశాఖ మంత్రి మహమూద్అలీ తెలిపారు. శనివారం బహదూర్పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను ఆయన హైద్రాభాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీతో కలిసి లబ్థిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మహమూద్అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తరువాతే రాష్ట్రం ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతున్నదని చెప్పారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, మతాల పేరుతో అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు.