Revanth Reddy | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో ఆమెపై కేసు వివరాలను చాటుగా సీఎం రేవంత్రెడ్డే ఇచ్చి ఉండొచ్చని బీజేపీ ఎంపీ అర్వింద్ అనుమానం వ్యక్తంచేశారు. యాదాద్రిలో మీడి యాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మీనా క్షీ నటరాజన్పై కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్కు కల ఏమైనా పడిందా?’ అని ప్రశ్నించా రు.
ఇది కాంగ్రెస్ కుట్రనా.. రేవంత్ కుట్రనా? అనేది ఆ పార్టీ విచారణ చేయించుకోవాలని సూచించారు. మహిళకు రాజ్యసభ సీటిస్తే బీజేపీ అడ్డుకుంటున్నదని మంత్రి సీతక్క ఆరోపిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా.. మీనాక్షి నామినేషన్ను నితిన్ నబిన్ నింపా డా? అని ఎదురు ప్రశ్నించారు. తెలుగు రాష్ర్టాల చరిత్రలో అతి ఘోరంగా ఓడిపోయే సీఎం రేవంత్రెడ్డి అని జోస్యం చెప్పారు.