Motkupalli Narasimhulu | కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ.. గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ ఆయన నిలదీశారు. ఒక్క సీటుకు కూడా మా మాదిగలు అర్హులు కారా? మా మాదిగ కులానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పది మంది సీఎంలను చూశాను కానీ.. ఈ రకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరన్నారు.
మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటీ? అంటూ ఆయన ప్రశ్నించారు. ఓ కాంగ్రెస్ నాయకుడిగా బాధపడుతున్నానన్నారు. మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా.. మూడు స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తుందని.. ఇది మాదిగ జాతికి అవమానకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజు ప్రయత్నం చేస్తున్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.