హైదరాబాద్: ఈటల రాజేందర్తో హుజూరాబాద్ ప్రజలకు ఒరిగేదేమీ లేదని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బీజేపీ నేతలు దళితబంధును ఎన్నిరోజులు ఆపగలరని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు దళితబంధు లాంటి పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హాస్టల్లో ఉండి చదువుకున్న ఈటలకు అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా అవినీతి సొమ్మును భారీ ఎత్తున్న పంచుతున్నాడని ఆరోపించారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈటల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపఎన్నికలో ఈటల గెలిచినా చేసేదేమీ లేదన్నారు. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కాగా, దళితబంధులో లక్ష కోట్లు మాదిగలకే వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి అన్నారు. దళితబంధు ద్వారానే మాదిగల సమగ్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. మాదిగలు మొత్తం టీఆర్ఎస్పార్టీ వైపే ఉన్నారని చెప్పారు.