మామిళ్లగూడెం, డిసెంబర్ 14: ఎస్సై పోస్టుల ఫిజికల్ ఈవెంట్స్లో తల్లీకూతుళ్లు సత్తాచాటారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన దారెల్లి నాగమణి, ఆమె కుమార్తె త్రిలోకిని ఫిజికల్ టెస్ట్లో పాసై మెయిన్ రాతపరీక్షకు ఎంపికయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ఈవెంట్స్లో మెరుగైన ప్రదర్శనతో విజయం సాధించారు.
ప్రస్తుతం వీరు ఖమ్మం నగరంలో ఉంటున్నారు. నాగమణి ములుగు జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. పైమెట్టు ఎక్కాలన్న పట్టుదలతో ఎస్సై రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకున్నది. తల్లి తపనను చూసిన కుమార్తె త్రిలోకిని కూడా పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.