యాదాద్రి: పనికిరాని ప్రతిపక్షాలు మదర్డైయిరీలో చేరి, పాడి రైతుల ఐక్యతను నిర్వీర్యం చేసే కుట్రలను చేపడుతు న్నారని, పాడి రైతులందరూ కుట్రలను తిప్పి కొట్టి తమ ఐక్యతను చాటాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సూచించారు. పాడి ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ఆలేరు నియోజకవర్గం అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నదన్నారు. నెలకు 5.60 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్న పాడి రైతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని 8 మండలాలకు చెందిన గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన పాల సంఘం చైర్మన్లకు సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డీసీసీబీ చైర్మన్ పాల్గొని చైర్మన్లను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మదర్డైయిరీని భ్రష్టు పట్టించిన ఘనత గత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. చైర్మన్లను కొనుగోలు చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ దేనని గుర్తు చేశారు. పాడి రైతులకు ఒక్కనాడైన బోనస్ ఇవ్వని నాయకులు చైర్మన్లమని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఆలేరు పాడి రైతులు చైతన్యం, ధైర్యం, ఐక్యత కలిగినవారని ఇదే ఐక్యతతో ప్రతిపక్ష పార్టీ నాయకుల విమ ర్శలను తిప్పికొట్టాలన్నారు. మదర్డైయిరీలో 305 పాలసంఘం చైర్మన్లు ఉంటే కేవలం ఆలేరు నియోజకవర్గంలోనే 143 మంది చైర్మన్లు ఉన్నారని, అందరూ ఒక్క తాటిపై ఉండి మదర్డైయిరీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడిని అన్నారు.
రూ. 4 ప్రోత్సాహకం అందజేసి పాడి రైతులను ఆదుకుంటామని అన్నారు. కొవిడ్ ఆపత్కాలంలో సైతం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్, ఆసరా, రైతు బంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మి పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంటే, రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. కరువు కాలంలో రైతులకు ఇబ్బందులు రావొద్దన్న సంక ల్పంతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. పశు సంవర్ధకశాఖ మంత్రితో మాట్లాడి నియోజ కవర్గంలో పశువైద్యాధికారుల నియామకం త్వరలో చేపడతామన్నారు. కొంత మంది పాడిరైతులకు మృతి చెందిన గేదేల ఇన్సూరెన్స్ అందలేదని తమ దృష్టికి వచ్చిందని, నేడు కలెక్టర్తో మాట్లాడి అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎల్డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీలు తోటకూరి అనురాధ, పల్లా వెంకట్రెడ్డి, మదర్డైయిరీ డైరక్టర్లు కళ్లెపల్లి శ్రీశైలం, లింగాల శ్రీకర్రెడ్డి, అర్కాల గాల్రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, చింతల పూడి వెంకటరామిరెడ్డి, మోతె పూలమ్మ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల రవీందర్రెడ్డి, పడాల శ్రీనివాస్, బాషబోయిన ఉప్పలయ్య, పాల సం ఘం చైర్మన్లు కొల్లూరి మల్లేశ్, ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఇమ్మడి దశరథ, మిట్ట వెంకటయ్య, పన్నాల అంజిరెడ్డి, ఎండీ బురాన్ పాల్గొన్నారు.