సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన స్థానికులు చెరువులో నుంచి ఇద్దరు చిన్నారులు.. అన్షిక (5), అభిగ్న (3) మృతదేహాలను వెలికితీశారు. తల్లి రేఖ కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ కలహాల వల్లే రేఖ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు.