హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో లక్ష్యానికి మించి పంటలు సాగయ్యాయి. వానకాలం సీజన్లో 1.23 కోట్ల ఎకరాల్లో పంట లక్ష్యం నిర్దేశించుకోగా, గురువారం వరకు 1.28 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవడం గమనార్హం. నిరుడు 1.19 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి.
ఈ ఏడాది అత్యధికంగా వరి 58.28 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంతోపాటు పత్తి 48.95 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.41 లక్షల ఎకరాలు, కంది 5.55 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వరిని నిరుడితో పోల్చితే ఈ ఏడాది సుమారు 12 లక్షల ఎకరాల్లో అధికంగా సాగైంది.