హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన ఏఐఎస్ఎఫ్ సబ్కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొఠారీ కమిషన్ సూచన మేరకు రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని సూచించారు. పాఠశాలల్లో క్రీడామైదానాలు, లైబ్రరీలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతోపాటు టీచర్ల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరారు.