హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేలా ఓటర్లను మరింత చైతన్య పరచాలని ఎన్నికల ప్రచారకర్తలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఈ మేరకు ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి ప్రచారకర్తలుగా నియమితులయిన ఆయా రంగాల్లోని ప్రముఖులతో బుధవారం తన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఓటర్ల జాబితాలో ఎకువమంది కొత్త ఓటర్లు నమోదయ్యేలా, ఓటర్లు తమ పేర్లను తనిఖీ చేసుకుని మార్పుచేర్పులను చేసుకునేలా చైతన్యపరిచినట్టు తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వీలయినంత మంది ఎకువ ఓటర్లు తమ ఓటు హకును ఉపయోగించుకునేలా వారిని చైతన్యపరచాల్సి ఉంటుందని సూచించారు.