మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ఒకటని జిల్లా ఎస్పీ రావిలాల వెంకటేశ్వర్లు అన్నారు. ప్రమాదాల తీవ్రత అధికమై ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని, ఇటువంటి విషయాలపై గట్టి చర్యలు తీసుకుని ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
కాగా, ఎస్.పి. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో నిన్న ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన అయిదుగురిని స్థానిక సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు నేడు హాజరు పరచగా.. నలుగురికి రెండు వేల రూపాయలు, ఒకరికి మూడు వేల అయిదు వందల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కుటుంబ సభ్యులు, సమాజం పట్ల బాధ్యత కలిగి మసలుకోవడంతో అనేక అనర్థాలు తొలుగుతాయని, అలా కాకుండా క్రమశిక్షణ లోపించినప్పుడు చట్టాలకు పని చెప్పక తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లా పోలీసు స్నేహపూర్వక శైలిలో వ్యవహరిస్తూనే శాంతిభద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటుందని ఈసందర్భంగా ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..