కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో ఈనెల 16న గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. ఆరు రోజుల నుంచి ఇన్ఫ్లో పెరుగుతుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం కూడా పెరిగింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2, 11 వ నెంబరు క్రస్టు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2566.71 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. కాలువలకు 382.63 క్యూసెక్కులు వెళుతుంది. మొత్తం 2984.68 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతుంది. ప్రాజెక్టులోకి 2984.68 ఇన్ఫ్లో కొనసాగింది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.35 అడుగులుగా (4.03 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు. నదిలోకి నీటిని విడుదల చేసినందున రైతులు, మత్స్యకా రులు, గొర్రెలు, మేకల పెంపకందారులు ఎవరు కూడా నదిలోకి వెళ్లవద్దని ఏఈ కోరారు.