హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ వసూలు లీజు ఒప్పందం జరిగిందని మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. లీజుకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ లీజు బిడ్డింగ్లో నాలుగు ప్రముఖ సంస్థలు షార్ట్లిస్ట్ అయ్యాయని, వీటిలో ఎకువ కోట్ చేసిన సంస్థకే లీజు దకిందని గుర్తుచేశారు. కిషన్రెడ్డి డిమాండ్ చేసినట్టు.. తాము సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. అదానీ అక్రమాలపై జేపీసీ వేయకుండా పారిపోయినవారు, ఓఆర్ఆర్ లీజుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రవ్వంతరెడ్డి (రేవంత్రెడ్డి), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తొండి సంజయ్ (బండి సంజయ్) పిచ్చి విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.
మంత్రి కే తారకరామారావు చొరవతో హైదరాబాద్కు అంతర్జాతీయ ఖ్యాతి దకడాన్ని కాంగ్రెస్, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే కేటీఆర్పై విమర్శలు చేస్తున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. పెద్దోళ్లను తిడితే పేపర్లలో పతాక శీర్షికల్లో వస్తామని చవకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ, ఆర్ఆర్ఆర్ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఇప్పటికే అభాసుపాలయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్లో కొత్తదనమేమీ లేదని ఇప్పటికే విడుదలైన రైతుల డిక్లరేషన్ను ప్రజలు మరచిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని తేల్చి చెప్పారు.