నేడు 14 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. దక్షిణ జార్ఖండ్, గాంగ్టక్, పశ్చిమ బెంగాల్ పరసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరిక జారీ చేసింది.