అశ్వారావుపేట, జూలై 18: ఐదెకరాల ఆయిల్పాం తోట ఉంటే సాఫ్ట్వేర్ జాబ్తో సమానమని ఇక్కడి రైతులు భావిస్తారు. ఇంకేముంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండువారిగూడేనికి చెందిన రైతు నడింపల్లి శివరామరాజు ఏకంగా తన 54 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలని నిర్ణయించాడు.
మంగళవారం ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని ఆహ్వానించి మొదటి మొక్కను ఆయనతో నాటించారు. ఆయిల్పాం సాగు చేస్తే ఇక డబ్బులు మస్తుగా వస్తాయని నమ్మిన రైతు మొదటి మొక్కకు రూ.500, రూ.200 నోట్లను కట్టి అక్కడున్న వారి దృష్టిని ఆకర్శించాడు. ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్పాం సాగు చేపట్టిన రైతు శివరామరాజును ఆయిల్ఫెడ్ చైర్మన్తోపాటు తోటి రైతులు అభినందించారు.