హైదరాబాద్, జులై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాపీ కొట్టేందుకే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం విమర్శించారు. తొమ్మిదేండ్లుగా తన రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ పర్యటనలు చేస్తున్నారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ధ్వజమెత్తారు.
విభజన హామీలు నెరవేర్చకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులను రానివ్వకుండా మోదీ వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మోదీ పర్యటనలు, బీజేపీ వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నారు.