హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమర్పించిన మోడికుంట, గూడెం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పంపింది. ఆ రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే సీడబ్ల్యూసీ ఆమోదం లభించింది. విభజన చట్టం ప్రకారంఇ టీవల నిర్వహించిన 16వ బోర్డు సమావేశంలో ఆయా డీపీఆర్లపై చర్చించారు. ఇరు రాష్ర్టాల అభిప్రాయాలను నోట్ చేసిన జీఆర్ఎంబీ తన పరిశీలననూ జత చేస్తూ ఆ డీపీఆర్లను సీడబ్ల్యూసీకి పంపింది.