ములుగు : ప్రధాన మంత్రి మోదీ(Narendra Modi) భారత దేశ సంపదను అదానీకి కట్టబెడుతున్నాడని ములుగు ఎమ్మెల్యే సీతక్క(Mla Seetakka) ఆరోపించారు.ములుగు జిల్లా(Mulugu district) కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. 2014 కంటే ముందు అదానీ(Adani) ప్రపంచ కుబేరుల జాబితాలో 609 స్థానంలో ఉంటే నేడు మోదీ సహకారం వల్ల రెండు, మూడు స్థానాలకు ఎగబాకి దేశాన్ని లూటీ చేస్తున్నాడని విమర్శించారు.
దేశం కోసం ప్రాణాలను అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీని, అదానీ ఆస్తుల ప్రస్తావనను తీసుకువస్తే ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతుందని అతగిసౌ అనర్హత వేటు వేశారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటు అప్రజాస్వామికమని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న మోదీ పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), వంట గ్యాస్ ధరలను పెంచి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రాజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చాంద్పాషా, పీఏసీఎస్ చైర్మన్ సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వంగ రవియాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.