హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయని.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావొస్తున్నది. 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది తే.. ఆ ఏడాది జూన్నుంచి రాష్ర్టాలు అస్తిత్వంలోకి వచ్చాయి. ఆ సమయానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది సాక్షాత్తూ మోదీయే. మరి సమాఖ్య స్ఫూర్తిని పదే పదే వల్లెవేసే ప్రధానమంత్రి? రెండు రాష్ర్టాల మధ్య పరస్పర చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలను పెద్దమనిషిగా తీర్చాల్సిన బాధ్యత లేదా? పోనీ ఆయా రాష్ర్టాలు సమస్యల పరిష్కారానికి విన్నవించినప్పుడైనా చర్యలు తీసుకోవాల్సిన విధి ప్రధానమంత్రిది కాదా? 2014 జూన్లో ప్రభుత్వం ఏర్పడితే.. జలవివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని కోరుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. ఇప్పటివరకూ ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు.. ఎందుకంటే కుంటిసాకులేవో చెప్తారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఒక కమిటీ ఏర్పాటు చేయడం ద్వారానో.. ముఖ్యమంత్రులు, అధికారులతో చర్చలు జరపడం ద్వారానో సమస్యలు పరిష్కరించవచ్చు కదా.. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగైనా ఎన్డీఏ సర్కారు వేసిందా? ఉమ్మడి సమస్యలు పరిష్కరించలేదు.. విభజన హామీలు నెరవేర్చలేదు.. రాష్ర్టానికి హక్కుగా రావాల్సినవీ ఇవ్వలేదు.. పార్లమెంట్లో మాత్రం చర్చించకుండా విభజించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెగ బాధపడిపోయారు. మోదీ వ్యాఖ్యలపై సామాజికమాధ్యమాల్లో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సమస్యలు తీర్చడం సాధ్యం కాక.. రాజకీయ లబ్ధికోసం విద్వేష వ్యా ఖ్యలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణకు ఏం చేశారంటూ నెటిజన్లు మోదీకి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటిలో కొన్ని..