దేవరకొండ, మార్చి 4 : మత రాజకీయాలు చేస్తూ ప్రజాపాలనను పట్టించుకోని మోదీ సర్కారును గద్దె దింపాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వత్రెడ్డి వర్ధంతి సభకు హాజరైన సందర్భంగా నారాయణ మాట్లాడారు. బడా వ్యాపారుల ప్రయోజనాలే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల బాగుకోసం చేసిందేమీ లేదని విమర్శించారు. పేద ప్రజలకు పాలన అందించే పార్టీలకు తమ సహకారం ఉంటుందన్నారు.