హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నేతన్నలపై కాఠిన్యం ప్రదర్శించింది. ప్రధాని మోదీ పాలనలో కొత్త పథకాలేవీ ప్రకటించకపోగా గతంలో ఉన్న కొన్ని మంచి పథకాలను సైతం రద్దుచేసింది. ముడి సరుకు ధరలను విపరీతంగా పెంచింది. పన్నుల భారం మోపింది.
చేనేతరంగాన్ని దెబ్బతీసిన మోదీ ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్ని..
నేతన్నను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో లక్షలాదిమందికి చేనేతరంగం జీవనాధారం. ఉమ్మడి రాష్ట్రంలో వారి బతుకులు అత్యంత దుర్భరంగా ఉండేవి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగేవి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన పథకాలతో చేనేతరంగం కొత్త జనసత్వాలు సంతరించుకున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉంటే చేనేతరంగానికి మరింత లాభం చేకూరేది.