Rain alert | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. నల్లగొండ, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చ ల్ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆదివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా ఘన్పూర్లో 71 మి.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో 53, ఖమ్మం జిల్లా లింగాలలో 43, రావినూతల, తిమ్మారావుపేటలలో 42, మధిరలో 39, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మి.మీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.