హైదరాబాద్: దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ఆఫీస్కు వస్తున్నారు. ఓరియంటేషన్ అనంతరం బస్సుల్లో నేరుగా అసెంబ్లీలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లనున్నారు.
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లోని పోలింగ్ బూత్లో ఓటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఓట్లేయనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేలతోపాటు, ఆంధ్రప్రదేశ్కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా ఇక్కడే ఓటేయనున్నారు.