హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించినందుకు ఆయన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయానికి రూ.26,831 కోట్లు, సాగునీటి రంగానికి రూ.26,885 కోట్లు ప్రతిపాదించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఆయిల్పాం సాగుపై మొబైల్ యాప్
ఆయిల్పామ్ సాగులో పారదర్శకత కోసం ఉద్యానశాఖ ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందించింది. సోమవారం దీన్ని మంత్రి నిరంజన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే తెలంగాణ విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ డైరీ, క్యాలండర్ను మంత్రి ఆవిష్కరించారు.